“కాంగ్రెస్ నాయకులు మహమ్మదీయులను సంతోష పెట్టటం, బుజ్జగించటం – అందుకై రాజకీయంగాను, ఇతరత్రా అనేక రకాల రాయితీలు, బహుమానాలు ఇచ్చే విధానాన్ని అనుసరించారు. తమ కోరికను మహమ్మదీయులు బలపరిస్తే తప్ప తాము ఎంతగానో కోరుకొంటున్న స్వాతంత్రాన్ని సాధించలేమని కాంగ్రెస్ వారు నమ్మటమే దీనికి కారణం.
కాంగ్రెస్ రెండు విషయాలను గుర్తించటంలో విఫలమైందని నాకు తోస్తున్నది.
వాటిలో మొదటిది : బుజ్జగింపు(ఎపీజ్మెంట్), పరిష్కారం (సెటిల్మెంట్) – ఈ రెండింటికీ మధ్య తేడా ఉంది. ఈ తేడా అత్యంత మౌలికమైనది కూడాను.
బుజ్జగించటం అంటే, దాడి చేసిన వానితో కుమ్మక్కై, తనకు అసంతృప్తి కల్గిన ఆ క్షణంలో తేలికగా దొరికిన అమాయక ప్రజానీకంపై దుండగీడు చేసిన హత్యలు, మానభంగాలు, దహనకాండలు, దోపిడీలను సమర్థించటమే! అలాగాక పరిష్కారమంటే ఎవరి హద్దులు ఏవో స్పష్టంగా నిర్వచించుకోవటం. అలా నిర్వహించుకున్న హద్దులను ఎవరూ దాటడానికి వీల్లేదు.
బుజ్జగింపులో దాడి చేసే వాని కోరికలపైన గాని, ఆశలపైగాని ఎటువంటి అవధులు, పరిమితులూ ఉండవు. దాడి చేసే వాని కోరికలకు, ఆశలకూ పరిష్కారం కళ్ళెం వేస్తుంది.
కాంగ్రెస్ నాయకులు గుర్తించటంలో విఫలమైన రెండవ అంశం – కాంగ్రెస్ అనుసరించిన రాయితీల ఇచ్ఛే విధానం మహమ్మదీయుల దాడిచేసే ధోరణిని మరింత పెంచింది. ఇంతకంటే ప్రమాదకరమూ, నష్ట దాయకమూ ఐన దేమంటే ఈ రాయితీలను హిందువుల ఓటమి ఓప్పుకోవటంగా, ఎదిరించే సంకల్పం వారిలో లేకపోవటంగా మహమ్మదీయులు వ్యాఖ్యానించు కొంటున్నారు.”
పాకిస్తాన్/పార్టిషన్ ఆఫ్ఇండియా గ్రంథంలో బాబా సాహబ్ ఆంబేడ్కర్ గారి పైవ్యాఖ్యలు తెలుగులో ‘డా౹౹అంబేడ్కర్ ను ఎందుకు గౌరవించాలి? ఎలా అనుసరించాలి?’ 55వపుటలో పొందుపరచబడినవి.
~ వడ్డి విజయసారధి