యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సినేషన్ లో రికార్డు సృష్టించిందని ప్రధాని మోదీ అన్నారు. యోగీ సర్కారు పేదలకోసం పనిచేస్తోందని చెప్పారు. అలీగడ్ లో రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ స్టేట్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలు ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ….యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రయోజనాలను సాధిస్తోందని మెచ్చుకున్నారు. ఉత్తర ప్రదేశ్లో ఇప్పటి వరకు 8 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. ఒక రోజులో అత్యధిక డోసులు ఇచ్చిన ఘనత కూడా ఉత్తర ప్రదేశ్కు దక్కింది.