దేశంలో జూలై 10న జరుపుకోనున్న ఈద్ అల్-అధా పండుగ సందర్భంగా ఆవులను బలి ఇవ్వద్దని ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIUDF) చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ ముస్లిం సమాజాన్ని కోరారు.
“హిందువులు ఆవులను తల్లిగా గౌరవిస్తారు, సనాతనీలు దానిని పవిత్ర చిహ్నంగా పూజిస్తారు. ఇస్లాం కూడా ఏ జంతువుకు హాని చేయకూడదని చెబుతోంది, కాబట్టి వాటికి హాని చేయకుండా ఉండాలి” అని అస్సాం లోక్సభ ఎంపీ, జమియత్ ఉలమా రాష్ట్ర అధ్యక్షుడైన బద్రుద్దీన్ అజ్మల్ అన్నారు.
“ఈద్ సందర్భంగా ఆవులను చంపవద్దని ముస్లింలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మేం ఈ పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆవుకు బదులుగా ఇతర జంతువులను బలి ఇవ్వమని నేను ముస్లిం సమాజాన్ని అభ్యర్థిస్తున్నా.. అల్లా ఆలా చేస్తే అంగీకరిస్తాడు. భారతదేశపు అతిపెద్ద ఇస్లామిక్ సెమినరీ అయిన దారుల్ ఉలూమ్ దేవబంద్ కూడా రెండేళ్ల క్రితం ఈద్ రోజున ఆవులను బలి ఇవ్వకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.. నేను అదే పునరావృతం చేస్తున్నా.. దయచేసి ఆవులను బలి ఇవ్వకండి ”అని అజ్మల్ తెలిపారు.