వైసీపీ ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు చంద్రబాబు. రొంపిచర్ల ఫ్లెక్సీ వివాదంలో టీడీపీ శ్రేణులపై కేసు నమోదు చేసిన పోలీసులు 8 మందిని అరెస్ట్ చేసి పీలేరు సబ్ జైలులో ఉంచారు. అన్నమయ్య జిల్లాకు వచ్చిన చంద్రబాబు సబ్ జైలులో ఉన్న టీడీపీ నేతలను పరామర్శించారు. కోడికత్తి డ్రామాలు ఆడొద్దని హెచ్చరించారు. ప్రశ్నించిన వారిని చంపేస్తున్నారని, ఏపీలో మైనార్టీలకు మనుగడ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల తీరు ఉగ్రవాదులను తలపిస్తుందని, ఇది స్టేట్ స్పాన్సర్ట్ టెర్రరిజమని అన్నారు. పోలీసులు లా అండ్ ఆర్డర్ పాటించాలని, చట్టానికి ఎవరూ చుట్టాలు కాదని.. అందరూ సమానమేనన్నారు.