సోషల్మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్లో చాలా యాక్టివ్ గా ఉంటుంటారు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా. స్ఫూర్తిదాయక కథనాలు, సందేశాత్మక పోస్టులు షేర్ చేస్తుంటారు. మధ్యలో ఆయన ఫాలోవర్లు వేసే ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలిస్తుంటారు. ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో మీరెప్పుడు చేరుతారని అడిగారు. దీనికి ఆయన బదులిస్తూ…నిజమేంటంటే నేను ఎప్పుటికీ అత్యంత సంపన్నుడిని కాలేను, ఎందుకంటే నేనెప్పుడూ నెంబర్ వన్ కావాలనుకోలేదు. అయితే దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాను 2022 ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసింది. 2.1 బిలియన్ డాలర్ల సంపదతో ఆయన 91 వ స్థానంలో నిలిచారు.
https://twitter.com/anandmahindra/status/1601768316036866050?s=20&t=NmgrPyT99XBxl9WKucRrIQ