కేంద్రమంత్రి కౌషల్ కిషోర్ తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆయన భావోద్వేగంతో ఆవేదనతో అన్నమాటలు అందర్నీఆలోచింపచేస్తున్నాయి.మద్యానికి బానిసైన అధికారి కన్నా ఆ అలవాటు లేని రిక్షావాలాకో, కూలీలో కుమార్తెను ఇచ్చి పెళ్లిచేయమని సలహాఇచ్చారాయన. ఉత్తరప్రదేశ్ లంభువా నియోజకవర్గంలో మద్యం అలవాటు విముక్తి కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మద్యం అలవాటువల్ల తన కుమారుడు ప్రాణాలే కోల్పోయాడని… తన కుటుంబానికి మద్యం తీవ్ర విషాదాన్ని, ఆవేదనను మిగిల్చిందని గుర్తుచేసుకుంటూ బాధపడ్డారు. తాను ఎంపీగా, భార్య ఎమ్మెల్యేగా ఉండి కూడా తమ కుమారుడిని కాపాడుకోలేకపోయామన్నారు మంత్రి. మద్యం అలవాటున్నవాడిని అల్లుడిగా చేసుకోవద్దని అమ్మాయిల తల్లిదండ్రులకు ఆయన పిలుపునిచ్చారు.