ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ..ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేసినట్లు పేర్కొన్న పాకిస్థానీ జర్నలిస్టును తాను భారత్కు ఆహ్వానించానన్న ఆరోపణల్ని ఖండించారు మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ. అన్సారీ ఆహ్వానం మేరకు యూపీఏ హయాంలో తాను ఐదుసార్లు భారత్ వచ్చానని పాకిస్తాన్ కు చెందిన నుస్రత్ మీర్జా పేర్కొన్న విషయం కలకలం రేపుతోంది. అయితే అసలు నుస్రత్ ఎవరో తనకుతెలియదని… ఆమెను ఎలాంటి కాన్ఫరెన్స్ కూ తాను పిలవలేదని అన్నారు. అప్పుడే తాను ఇక్కడ సేకరించిన కీలక సమాచారాన్ని అక్కడకు చేరవేసినట్టు తెలిపారామె. 2010లో జరిగిన కాన్ఫరెన్స్కు హమీద్ అన్సారీ తనను ప్రత్యేకంగా పిలిచారని చెప్పారు నుస్రత్. హమీద్ అన్సారీ ఇరాన్లో భారత రాయబారిగా ఉన్నప్పుడు కూడా జాతీయ ప్రయోజనాలను తాకట్టుపెట్టెలా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి.
https://twitter.com/AdityaRajKaul/status/1547652955683188742?s=20&t=2CH2GisZVtXSdr5HWkdd4g