భారతి ఎయిర్టెల్ ఈనెల 17న ప్రభుత్వంతో కుదిరిన ఒప్పొందం ప్రకారం 5G స్పెక్ట్రమ్ కోసం టెలికాం డిపార్ట్మెంట్ (DoT)కి రూ. 8312.40 కోట్లు చెల్లించింది. అలా చెల్లించిన కొన్ని గంటల్లోనే ఎయిర్టెల్కు 5G స్పెక్ట్రమ్ బ్యాండ్లను కేటాయించినట్లు టెలికాం డిపార్ట్మెంట్ కేటాయింపు లెటర్ ని ఇచ్చింది. నిన్న ఎయిర్టెల్ స్పెక్ట్రమ్ బకాయిల కోసం టెలికం శాఖకు రూ. 8312.4 కోట్లు చెల్లించిన వెంటనే ఎటువంటి ఇబ్బందులు, అధికారుల వెంట పడడం, అధికారుల కారిడార్ల చుట్టూ పరిగెత్తడం లేకుండా అనుకున్న ఫ్రీక్వెన్సీ బ్యాండ్ల కేటాయింపు లేఖను కొన్ని గంటల వ్యవధిలో మాకు అందించింది టెలికాం శాఖ అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
దీనినే అద్భుతమైన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు అని అన్నారాయన. DOTతో నా 30 సంవత్సరాలకు పైగా నేరుగా ఉన్న అనుభవంలో ఇటువంటి సంఘటన ఇది మొదటిది. వ్యాపారం చేయడం అంటే ఇలాగే ఉండాలన్నారు. ఇది ఈ దేశాన్ని మార్చగల మార్పు అని మిట్టల్ అన్నారు.
….చాడా శాస్త్రి….