గుజరాత్ కాంగ్రెస్ సీనియర్ నేత, గుజరాత్ మాజీ మంత్రి భరత్సింగ్ సోలంకి అయోధ్యలోని రామ మందిరంపై నీచమైన వ్యాఖ్యలు చేశారు. రాముడి పేరుతో బీజేపీ డబ్బులు వసూలు చేసిందని.. అయితే రామ మందిరంలోని ఇటుకలపై కుక్కలు మూత్ర విసర్జన చేస్తున్నాయని గుజరాత్లో జరిగిన ఓ సభలో సోలంకి అన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
ధోల్కాలో కాంగ్రెస్ పార్టీ సభను ఏర్పాటు చేసింది.
“దేశంలో మహిళలు చాలా అమాయకులుగా ఉండేవారు. రామ మందిర నిర్మాణంలో ఉపయోగించేందుకు అయోధ్యకు పంపే ముందు ఇటుకలపై తిలకం పూసి, పూజించేవారు. ఆ ఇటుకల పరిస్థితి ఏమైంది? కుక్కలు వాటిపై మూత్ర విసర్జన చేశాయి” అని సింగ్ అన్నారు.
“ఈ ఇటుకల సేకరణతో మీరు ఏం చేస్తారని నేను ఒక రామసేవక్ని అడిగాను. అప్పుడు వారు వాటిని సేకరించి గాలిలోకి విసిరేస్తామని అన్నాడు. రాముడు తనకు కావలసినది తీసుకుంటాడు, మిగిలినవి మనం ఉంచుకుంటాం” అని ఆతను అన్నట్లు సింగ్ హిందువులను అవమానించే విధంగా అన్నారు.సోలంకి ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా లో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.