ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఖిత రాజ్యాంగం మనది. ఈ రాజ్యాంగ రచనకు రెండుసంవత్సరాల పదకొండునెలల 18 రోజులుపట్టింది. 167 రోజుల్లో పదకొండు సమావేశాలుజరిగాయి. రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్లను పొందుపరిచారు. దాదాపు 145,000 పదాలుఉన్నాయి. ఈ రాజ్యాంగాన్నిరాజ్యాంగసభ 1949 నవంబర్ 26 నఆమోదించింది. దానితోఅధికార మార్పిడి పూర్తై మనదైన గణతంత్ర దేశం ఏర్పడింది.అయితే దాని క్రమం ఎట్లా ఉంది..అది ఏ మేరకు భారతీయతను ప్రతిబింబిస్తున్నది చూద్దాం.
1) బ్రిటిష్ పార్లమెంట్లో భారత దేశానికి పూర్తి స్వతంత్రం ఇవ్వాలని 1947 ఫిబ్రవరి 20వ తీర్మానం ప్రవేశపెట్టారు.
2) 1947 మార్చిలో లార్డ్ మౌంట్ బాటెన్ గవర్నర్ జనరల్ గా భారత్ లో అడుగుపెట్టారు. అన్నితానై దేశవిభజన, సంస్థానాల విలీనం మొదలైన అన్నిపనులు బ్రిటిషర్ల ప్రయోజనం ప్రకారం పూర్తి చేశాడు. ఒక్క హైదరాబాద్ స్టేట్ మినహా అన్నీ పూర్తయ్యాయి. 1948 జూన్ 21న మౌంట్ బాటెన్ తిరిగి లండన్ తిరిగి వెళ్లిపోయాడు.
3) 1947 జూలై 18 న బ్రిటిష్ పార్లమెంట్లో ఇండియన్ ఇండిపెండెన్స్ కాట్ పేరుతో ఒక చట్టాన్నిఆమోదించింది. దాని ప్రకారం భారత్ కు పూర్తి స్వాతంత్ర్యం ఇచ్చేందుకు బ్రిటష్ పార్లమెంట్ రంగం సిద్ధం చేసింది. .
4) బ్రిటిష్ పార్లమెంట్ 1948 జూన్ 30 నాటికి బ్రిటిష్ ఇండియా పాలన అధికార మార్పిడి పూర్తి చేసింది. ఆ తదుపరి సంస్థానాల భవిష్యత్తు చర్చించి చివరిబదిలీ నిర్ణయం కూడా ప్రకటించింది.
5) 1946 డిసెంబర్ 9న భారత రాజ్యాంగసభకు డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ తాత్కాలిక అధ్యక్షునిగా చేశారు.
6) 1947 ఆగస్టు 29న గాంధీ సలహా మేరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను సభ్యుడిగా ఎన్నుకున్నారు.
7) 1947 ఆగస్టు 30న అంబేద్కర్ ను డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
8) 2సంవత్సరాల 11 నెలలో 18 రోజులలో రాజ్యాంగ రచన పూర్తి చేసారు.1949 నవంబర్ 26న రాజ్యాంగసభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. అదేరోజు స్వతంత్రభారత జాతీయపతాకం, జాతీయ గీతాన్ని కూడా ఆమోదించడం జరిగింది.
9) 1950 జనవరి 26 నుండి పూర్తి భారతప్రజాస్వామ్య వ్యవస్థ పనిచేయటం ప్రారంభమైంది. భారత్ గణతంత్ర దేశంగాఏర్పడింది
బ్రిటిష్ వారు భారత్లో పార్లమెంట్ వ్యవస్థను ఏర్పాటుచేసే ముందు ఏమిచేసారు?
1) ఈస్ట్ఇండియా కంపెనీ పరిపాలన సమయంలోనే బ్రిటిష్వాళ్ళు ఈ దేశము యొక్క పరంపరాగతవ్యవస్థలు అన్నిటిని సమూలంగా పెకలించి బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థకు అనుకూలంగా కొత్త వ్యవస్థలనునిర్మాణం చేసే ప్రయత్నాలు చేసింది.
1726 లో బ్రిటీష్ వాళ్ల జుడీషరీవ్యవస్థ అంటే న్యాయవ్యవస్థనుప్రవేశపెట్టారు, ప్రారంభంలో బాంబే, మద్రాస్, కలకత్తాలో ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది. పరంపరాగతంగా ఉన్నమన న్యాయవ్యవస్థ క్రమంగా కనుమరుగైపోయింది . జ్యుడీషియరీవ్యవస్థను అప్పటినుంచి ఒక క్రమపద్ధతిలో దేశమంతా విస్తరింపజేశారు.
2) 1800 సంవత్సరంలో గవర్నర్ జనరల్ లిచర్డ్ వేల్సి కలకత్తాలో విలియం కాలేజీని ఏర్పాటుచేశారు. దానితో మెకాలే రూపొందించిన పాశ్చాత్య
విద్య ప్రారంభమైంది. ఆంగ్లేయులవిద్య ద్వారానే ఈదేశం యొక్క ఆనవాళ్లు లేకుండా చేయాలని మెకాలేనిర్ణయించుకున్నాడు. ఆయన చెప్పిన ఒక మౌలికఅంశం భారతదేశంలో పాశ్చాత్యవిద్య వ్యాప్తిచేయడానికే డబ్బులుఖర్చుపెట్టాలి. భారతీయతత్వశాస్త్రాలు బోధించేఅన్నికళాశాలను మూసివేయాలిఅని. భారతీయతత్వశాస్త్రాలు భారతీయవిషయాలని సజీవంగా ఉంచుతాయి కాబట్టి ఆకళాశాలను పూర్తిగా మూసివేయాలని చెప్పాడు. అంటే అప్పటివరకు ఉన్నటువంటి విద్యావ్యవస్థను సర్వనాశనంచేసే ప్రయత్నం చేశాడు , దాంతోగుమాస్తాలను తయారుచేసే విద్యమొదలైంది. బ్రిటిష్వ్యవస్థల్లోఉద్యోగాలకోసం ఆచదువులు చదువుకోవటం అనివార్యమైంది.
3) అట్లాగే ఈదేశం ఒకదేశం కాదు అని భ్రమలు కలిగించేందుకు అనేక సిద్ధాంతాలు రచించారు. ఈ దేశంలోఈరోజుకి ఆసిద్ధాంతాలు చలామణి అవుతున్నాయి.
4)పాశ్చాత్యభావజాల ప్రభావం మనదేశంలో మేధావులపై ఎంతఉందో కొన్నిఉదాహరణలు చూద్దాం. ” ఎ నేషన్ ఇన్ మేకింగ్ ” అనేశీర్షికన 1922లోసురేంద్రనాథ్బెనర్జీ ఒకపుస్తకం రాశారు. దాంట్లోఅమెరికా రష్యావలె భారత్ కూడా ఒక జాతి కాదు ఉపఖండం. ఇక్కడ అనేక జాతులు ఉన్నాయి అని వ్రాసుకుంటూ వచ్చారు. 1930వసంవత్సరంలో లండన్ కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదువుకుంటున్న రహమత్ అలీ అనే భారత విద్యార్థి ఇస్లాంజాతి-భారతీయముప్పు అనే పేరుతో రాసిన పుస్తకంలో భారత్ అనేక జాతుల సమూహం అని ఉంది. ఆ జాతులు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నాడు.
5) 1942లో అచ్యుతపట్వర్ధన్, అశోక్ మెహతా రాసిన కమ్యూనల్ ట్రయాంగిల్ అనే మరో పుస్తకంలో …అధర్వణవేదములోని భూమిసూక్తంలో చెప్పబడిన”ఈభూమినాతల్లినేనుఆమెపుత్రుడను” అనేభావన ఈదేశం ఒకేదేశమని స్పష్టంచేస్తున్నది. అంతేకాదు ప్రాచీనకాలం నుంచి ఈదేశంలో రాజులు బలమైన రాజ్యవ్యవస్థకోసం అశ్వమేధయాగాలు చేశారనిచరిత్రచెబుతున్నది. అనాదిగా ఇది ఒకేదేశం అనే విషయాన్ని దయానంద, వివేకానంద, అరవింద, నివేదిత, తిలక్ వంటి అనేకులు బలంగా వినిపించారు.
1920 నుండి భారతదేశంలో చోటుచేసుకున్న అనేక విపరిణామాలు దేశఆలోచనవిధానాన్ని సంశయంలోపడేసింది. అదేస్వాతంత్రపోరాటాన్ని, రాజ్యాంగం తయారీని ప్రభావితంచేసింది. ఆ భావాల కారణంగానే ఈరోజున దేశంలోఅనేక సంఘర్షణలు నడుస్తున్నాయి అనేది చరిత్ర చెబుతున్నసత్యం . భారతరాజ్యాంగంలోని ఆర్టికల్ ఒకటిప్రకారం భారతదేశాన్నిరాష్ట్రాల యూనియన్గాప్రకటించింది, యూనియన్నుండి విడిపోయే హక్కు ఏరాష్ట్రానికి లేదు అని కూడా దాంట్లోచెప్పబడింది . ఈదేశం పేరు ఏదిఉండాలి అనే వాదోపవాదాలుజరిగాయి , సంశయంలోపడి”INDIA that is BHARATH” అని వ్రాయబడింది . వేలసంవత్సరాల నుండి ఈదేశానికీ భారత్ అనేపేరు ఉన్నది దానిని ఎందుకు చెప్పలేకపోయారు .ఈరోజుకి కూడా దానిపైన స్పష్టత ఎందుకు ఇవ్వలేకపోతున్నరు .
బ్రిటిష్ఇండియా 1935లో తెచ్చిన” భారతప్రభుత్వచట్టం ” ప్రభావం రాజ్యాంగం మీద చాలా ఉంది. ఆ చట్టంలోని న్యాయవ్యవస్థ,ప్రాథమిక హక్కులు ఏవోకొన్ని మార్పులు మాత్రమే చేశారు. అట్లాగే ప్రపంచంలోని కొన్ని రాజ్యాంగాలను పరిశీలించి కొన్ని విషయాలు తీసుకున్నారు. మొత్తానికి ఒక కలగూరగంపగా రాజ్యాంగాన్ని తయారుచేసారు అందుకే. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తొలిరోజుల్లో మనదేశాన్ని మనం సమైక్యజాతిగా సమున్నత సంస్కృతి గల సమాజంగా చూపించలేకపోయాం, అట్లాగే రాజ్యాంగంలో కొన్ని విలువలు పొందుపరుస్తారు. వాటిని ఎట్లా పాటించాలి ఎట్లా కాపాడుకోవాలి అన్నది ప్రజల విజ్ఞతకు వదిలేస్తారు. ఆ విలువలను ఎవరికి కావలసిన రీతిలో వారు మాట్లాడటం, భాష్యాలు చెప్పటం ప్రారంభిస్తే ఆ వ్యవస్థ సరిగ్గా నడవదు. ఈరోజున రాజ్యాంగ మూలస్తంభాలు దేనికది ఈ దేశప్రజాస్వామ్యవ్యవస్థను, పాలనావ్యవస్థను ప్రభావితంచేసే ప్రయత్నం చేస్తున్నాయి.
భారతీయజీవన మౌలికఅంశాలు కాపాడబడుతున్నాయా ?
1) రాజ్యాంగంలోభారతీయ జీవన విధానంలోమౌలిక అంశమైన ధర్మము అనేశబ్దంలేదు, ధర్మమే ఈ హిందూసమాజాన్ని వేలసంవత్సరాల నుంచి నిలబెట్టుకుంటూ వస్తున్నది. ఆ ధర్మం ఆధారంగానే 1000 సంవత్సరాల విదేశీ ఆక్రమణలను తట్టుకొనినిలబడింది. దానిని రాజ్యాంగ పెద్దలు ఎందుకు విస్మరించారు ? .ఎంతో వైవిద్యభరితమైన ఈదేశాన్ని ధర్మము సంస్కృతులే కలిపి ఉంచుతాయి ఎందుకు ఆ విషయాన్ని ప్రస్తావించలేకపోయారు ఆలోచించవలసిన అవసరం ఉంది.
2) ఈదేశంలోని గ్రామాలూ రిపబ్లిక్లు, సర్వతంత్ర స్వతంత్రమైనవి. వేల సంవత్సరాల కాలంలో గ్రామీణ వ్యవస్థ జోలికి ఎవరు పెద్దగా వెళ్లలేదు, స్వతంత్ర గ్రామీణ వ్యవస్థ ఎప్పుడు కాపాడబడుతూ వస్తున్నది. కానీ బ్రిటిష్ దోపిడీ వ్యవస్థ గ్రామాలను ధ్వంసంచేసింది. పాలనావ్యవస్థను, సామజిక వ్యవస్థను నాశనం చేసింది. అందుకే గాంధీజీ స్వతంత్రం వచ్చిన వెంటనే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది ఇకరావాల్సింది” గ్రామస్వరాజ్” అనిఅన్నారు. ఆ మాటను రాజ్యాంగసభ ఎందుకు పరిగణనలోకి తీసుకుని ఆలోచించలేదు, ఇప్పటికీ అర్థంకాని ఒకప్రశ్న. స్వతంత్రభారత రాజకీయాలు గ్రామీణవ్యవస్థను ధ్వంసం చేసుకుంటూ వస్తున్నాయి , దాని కారణంగా సామాజికవ్యవస్థలో కూడా అనేక సమస్యలు చోటుచేసుకొంటున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని పాలనావ్యవస్థలో చేయవలసిన మార్పుల గురించి ఆలోచించవలసిన అవసరం ఎంతైనాఉన్నది.
3) ఈదేశంలోహిందువులు , ముస్లింలు , ,క్రైస్తవులు అనిమాట్లాడుతూఉంటారు. ఇస్లాం, క్రైస్తవం విదేశీ మూలాలు ఉన్న మతాలు. హిందూఅనేది ఈదేశధర్మమూ , సంస్కృతిని తెలియచేసేదని సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో చెప్పినా రాజకీయలు మతంగానే మాట్లాడిస్తూ దేశంలో విభేదాలు నిర్మాణం చేస్తున్నాయి. ఇటువంటి వక్రీకరణలు త్రిప్పికొట్టాలి.
4) వైవిధ్య భరితమైన ఈ దేశంలోఅనేక భాషలుఉన్నాయి , ఒకప్పుడు ఈ దేశానికే అనుసంధాన భాషగా సంస్కృతంఉండేది , స్వతంత్రం వచ్చిన వెంటనే సంస్కృతాన్ని విద్యలో ప్రవేశపెట్టి అనుసంధానభాషగా వికసింపచేయలేకపోయారు.ఇప్పటికి ఆంగ్లమే ఈదేశాన్ని ఏలుతున్నది. హిందీభాషను అనుసంధానభాషగా చేయాలని చేస్తున్న ప్రయత్నాలు వివాదాలకు కారణమౌతున్నాయి. ఈదేశానికీ జాతీయభాష ఏది అనే ప్రశ్ననేలేదు. రాజ్యాగం గుర్తించిన భాషలన్నీ జాతీయభాషలే. కావలసింది అనుసంధానభాష దానిని ఇప్పటికి నిర్ణయించలేకపోతున్నాము .
వెయ్యి సంవత్సరాల నిరంతర సంఘర్షణలలోఅనేక వికృతులు సమాజంలో చోటుచేసుకున్నాయి. స్వాతంత్రం వచ్చిన వెంటనే రాజ్యాంగనిర్మాణంకోసం బ్రిటిషి పార్లమెంటరీ వ్యవస్థనే ఆధారంగా తీసుకోవాల్సివచ్చింది. ఇప్పటికీ 72 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పటికైనా దేశమౌలిక విషయాలపై సమీక్ష చేయవలసిన అవసరం ఉన్నది. భారతీయ ఆత్మ కేంద్రంగా పాలనావ్యవస్థను వికసింపచేసేందుకు ఏమిచేయాలి అని ఆలోచించాలి. గ్రామీణ వ్యవస్థను చక్కదిద్దాలి. అప్పుడే భారతదేశం సగర్వంగా ప్రపంచంలో తలెత్తుకుని ప్రపంచదేశాలకు సరియైన మార్గదర్శనం చేయగలుగుతుంది . భారతీయవిద్యావ్యవస్థను భారతీయ న్యాయవ్యవస్థను వికసింపచేసేందుకు ఏమిచేయాలి అనే విషయాన్ని చర్చించి నిర్ణయించడంచాలాఅవసరం. ఒకప్పుడు భారతదేశంలోన్యాయవ్యవస్థ క్రింద గ్రామం నుంచి పైవరకు విస్తరించి ఉండేది, గ్రామీణక్షేత్రంలో న్యాయవ్యవస్థ ఉండాలని సుప్రీంకోర్ట్ ఈమధ్యకాలంలో చెప్పటం ప్రారంభించింది. రాజకీయాలు ఆపనిని సక్రమంగా చేయినిస్తాయా అనేది ఒక పెద్దప్రశ్న.ఇటువంటి విషయాలను దేశంలో మేధావులు, పెద్దలు అందరూ చర్చించి సరియైన దిశానిర్దేశం చేస్తే బాగుంటుంది. ఈదేశ పరంపరాగతమైన విషయాల ఆధారంగా పాలనా వ్యవస్థ వికసింపచేసే మంచిరాజ్యాంగం కోసం మనం ఎదురుచూద్దాం. -రాంపల్లి మల్లికార్జున్