హైదరాబాద్ లో ఓ వైద్యుడి ఆత్మహత్య కలకలం రేపుతోంది. జూబ్లీహిల్స్ కు చెందిన మజార్ అనే డాక్టర్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రోడ్ నెంబర్ 12లో ఉండే 64 ఏళ్ల డాక్టర్ మజార్ అలీ… ఇంట్లో ఎవరూలేని సమయంలో గన్ తో కాల్చుకున్నాడు. తీవ్రగాయాలపాలైన మజార్ ను అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మజార్ చనిపోయాడు. కుటుంబకలహాలే ఆత్మహత్యకు కారణమని సమాచారం. మజార్ అలీఖాన్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి సమీపబంధువు.