
File Photo
కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె సర్ గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరారని…ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కొన్ని పరీక్షలు నిర్వరించామని, తమ పర్యవేక్షణలోనే ఉందని తెలిపారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఛెస్ట్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అరూప్ బసు నేతృత్వంలోని వైద్యుల బృందం సోనియా పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.
https://twitter.com/ANI/status/1631581569872805888?s=20