ట్విట్టర్కు ఝలక్ ఇచ్చిన కేంద్రం.. కౌంటర్ ఎటాక్ ఎలా చేశారో తెలుసా..?
ప్రముఖ సోషల్ మీడియా యాప్ ట్విట్టర్కు కేంద్ర ప్రభుత్వం ఊహించని ఝలక్ ఇచ్చింది. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆందోళనలకు సంబంధించి పాక్,ఖలిస్థాన్కు సంబంధించిన కొన్ని ట్విట్టర్ ఖాతాల నుంచి తప్పుడు సమాచారం వైరల్ అవుతోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఖలిస్తాన్,పాక్కు చెందిన 1178 ట్విట్టర్ అకౌంట్లను తొలగించాలని ట్విట్టర్ సంస్థను ఆదేశించింది. అయితే ఈ నేపథ్యంలో ట్విట్టర్ సంస్థ కేవలం 500 అకౌంట్లను తొలగించి.. మిగతా అకౌంట్లను అలానే ఉంచింది. అంతేకాదు.. 500 అకౌంట్లు కూడా భారత్లో మాత్రమే నిషేధం అని.. ఇతర దేశాల్లో వాటిని చూడవచ్చని ట్విట్టర్ తెలిపింది. మిగతా వాటిని భావప్రకటన స్వేచ్ఛ పేరుతో తొలగించడం లేదని పేర్కొంది. దీనిపై తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అది కూడా ట్విట్టర్కు ఝలక్ ఇచ్చేలా.. ట్విటర్కు భారత్లో ప్రత్యర్థిగా మారుతున్న “కూ”యాప్లో కౌంటర్ ఇచ్చింది. ట్విటర్ స్పందన అసహజంగా ఉందని కేంద్రం అభిప్రాయపడింది. సర్కార్తో సమావేశం కావాలన్న ట్విటర్ ప్రతిపాదనను ఐటీ శాఖ కార్యదర్శి పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఆయన ట్విటర్ సంస్థ సీనియర్ మేనేజ్మెంట్తో మాట్లాడుతున్నారు. అంతకుముందు” ట్విటర్ స్పందన అసహజంగా ఉంది. ప్రభుత్వం త్వరలోనే దీనిపై స్పందిస్తుంది” అంటూ “కూ”లో ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది.