మార్గదర్శి కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు
36 మంది బ్రాంచ్ మేనేజర్లను అరెస్ట్ చేయవద్దని, ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. అయితే విచారణ కొనసాగించవచ్చునని స్పష్టం చేసింది. మార్గదర్శి చిట్ఫండ్స్ కేసులో ఆ సంస్థ చైర్మన్ రామోజీరావును ఏపీ సీఐడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. చిట్ పాడుకున్న తరువాత ఆ మొత్తం డబ్బుల్ని వినియోగదారుడికి ఇవ్వకుండా తమసంస్థల్లోనే డిపాజిట్ చేయించారనే అభియోగాలపై కేసులు నమోదు చేశారు. సీఆర్పీసీ 160 సెక్షన్ కింద రామోజీరావుతోపాటు ఆయన కోడలు, మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్కు ఏపీ సీఐడీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఈనెల 3న విచారణకు అందుబాటులో ఉంటామని వారు చెప్పడంతో అధికారులు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 36లోని రామోజీరావు నివాసానికి వెళ్లారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారుల బృందం వారిని ప్రశ్నించింది.