ఆర్యసమాజ్ ఇచ్చే మారేజ్ సర్టిఫికెట్లు చెల్లబోవని సుప్రీం ధర్మాసనం తేల్చిచెప్పింది. వివాహ సర్టిఫికెట్లను అధికారులు జారీ చేస్తారని..అది ఆర్యసమాజ్ పని కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మధ్యప్రదేశ్ లో ఓ ప్రేమపెళ్లిపై నమోదైన కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. దయానంద సరస్వతి స్థాపించిన హిందూ సంస్కరణ సంస్థ అయిన ఆర్యసమాజ్ కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తోంది.