శ్రీలంకలో పరిస్థితి మరింత అదుపు తప్పింది. నిరసనకారులు ఇంకా అధ్యక్షభవనంలోనే ఉండి హడావుడి చేస్తున్నారు. ఇక ప్రధాని కార్యాలయ ప్రాంగణంలోకి గుంపులుగా వెళ్లి, భవనంపైకెక్కి శ్రీలంక జాతీయపతాకాన్ని ఎగురవేశారు. దీంతో
తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రణిల్ విక్రమసింఘే సంచలన నిర్ణయం తీసుకున్నారు.శాంతిభద్రతలు కాపాడేందుకు లంక సైన్యానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఏదైనా చేయండని..అవసరమైతే కనిపిస్తే కాల్చివేత చర్యలకూ వెనకాడవద్దని సైన్యానికి స్వేచ్ఛ ఇచ్చినట్టు తెలిసింది.
తనను తాత్కాలిక అధ్యక్షపదవినుంచి తప్పుకునేలా చేయాలని విధ్వంసకారులు చూస్తున్నారని..కానీ ఫాసిస్టుల చేతుల్లోకి దేశాన్ని వెళ్లనివ్వబోనని విక్రమసింఘే అన్నారు. అందుకే పరిస్థితిని అదుపు చేయాలని ఆర్మీకి ఆదేశాలు ఇచ్చినట్టు ఆయన తెలిపారు.
https://twitter.com/AFP/status/1547107995674607616?s=20&t=7NPDWPnWsShII564b_RZJg
అటు చెప్పిన మాట ప్రకారం అధ్యక్షుడు రాజపక్స రాజీనామా చేస్తారని స్పీకర్ మహింద యప అబేయవర్థనె తెలిపారు. 73 ఏళ్ల గొటబాయ ఉదయమే దేశం విడిచి మాల్దీవులకు వెళ్లిపోయారు. జులై 20న కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందని, అప్పటివరకూ దేశ పౌరులు సంయమనం పాటించాలని స్పీకర్ అబేయ వర్దనె ప్రజలకు, నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు.