భారత్ లో కరోనా వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో ఇప్పటికే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాక్సన్ భారత పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. భారత్లో పర్యటించకూడదని తమ పౌరులను అమెరికా ప్రభుత్వం సూచించింది. అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ CDC ఓ ప్రకటనలో తెలిపింది.భారత్ లో లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిత్యం వేలసంఖ్యలో మృత్యువాత పడుతున్న పరిస్థితి. నిన్న ఒక్కరోజే 1,619 మంది మరణించారు. ఈ క్రమంలో అమెరికా ప్రభుత్వం సైతం తన పౌరులను భారత్లో కొంతకాలం పర్యటించకూడదని సూచించింది. అత్యవసరపరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే పూర్తిస్థాయిలో టీకాలు తీసుకుని మాత్రమే ప్రయాణ పెట్టుకోవాలని అమెరికా పౌరులకు సీడీసీ సూచించింది.
న్యూజిలాండ్ ప్రభుత్వం ఇదే బాటలో భారత్ నుంచి ప్రయాణీకుల్ని నిలిపేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బ్రిటన్ భారత్ ను రెడ్ లిస్టులో పెట్టింది.