కృష్ణ జన్మభూమి స్థలంలో ఉన్న వివాదాస్పద షాహీ ఈద్గా మసీదులో ఉన్న మతపరమైన శాసనాలు, కళాఖండాలు లేదా చిహ్నాలను ధ్వంసం చేయకుండా ముస్లింలను ఆ ప్రాంతంలోకి నిషేధించాలని మధుర కోర్టులో పిటిషన్ దాఖలైంది. కోర్ట్ సుదీర్ఘ వేసవి సెలవుల్లో ఆ ప్రాంతంలో యథాతథ స్థితిని కొనసాగించాలని కోర్టును అభ్యర్తించారు.
జ్ఞానవాపి ఎపిసోడ్లో శివలింగం సహా హిందూ మత చిహ్నాలు కనుగొనబడినట్లు నివేదించిన తర్వాత, ఈ వివాదంలో ప్రతివాదులు షాహీ ఈద్గాలోని హిందూ మత చిహ్నాలు, శాసనాలను ధ్వంసం చేయడానికి అన్నివిధాలా ప్రయత్నాలు చేసే అవకాశముందని పిటిషన్ ఆరోపించింది. కాబట్టి కోర్టు వేసవి సెలవుల్లో ఆ ప్రాంతంలో యథాతథ స్థితి ఉండేలా చూడాలి అని కోరారు.
వివాదాస్పద ఈద్గా మసీదు నిర్మాణంపై దాఖలైన 3 కేసుల్లో ఒక పిటిషనర్ అయిన మనీష్ యాదవ్ మథుర జిల్లా సీనియర్ డివిజన్ కోర్టులో ఈ పిటిషన్ను దాఖలు చేశారు. మిగిలిన రెండు వ్యాజ్యాలను లక్నో నివాసి రంజనా అగ్నిహోత్రి దాఖలు చేశారు. మరో ఐదుగురు అడ్వకేట్ మహేంద్ర ప్రతాప్ సింగ్ ద్వారా పిటిషన్ దాఖలు చేశారు.