నేటినుంచి రైతుబంధు నిధులు రైతుల ఖాతాలో జమవుతున్నాయి. ఇప్పటికే కేంద్రం అందిస్తున్న పీఎం కిసాన్ పెట్టుబడిసాయం రైతులకు అందింది. ఇక ఇప్పటికే రైతు బంధు పోర్టల్ ను ఓపెన్ చేసిన సర్కారు క్రమంగా వారి ఖాతాల్లోకి పెట్టుబడిసాయాన్ని విడతలవారీగా వేస్తోంది. కొత్తగా పట్టా పాసుపుస్తకాలు పొంది సీసీఎల్లో నమోదైన రైతుల నుంచి రైతుబంధుకు దరఖాస్తులు తీసుకుంటున్నారు.