కార్తీక మాసం శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా గుడ్లూరు దళిత గిరిజన వాడలోని గ్రామదేవతల ఆలయాలకు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి సహాయ సహకారాలతో హిందూ జాగరణ సమితి ఆధ్వర్యంలో దూప దీప నైవేద్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ధర్మ పరిరక్షణ కొరకు చేయవలసిన పనులను ఆలయకమిటీకి ట్రస్ట్ ప్రతినిధులు వివరించారు.అన్య మతం ప్రలోభాలకు లొంగ కుండా మన ధర్మాన్ని కాపాడుతున్న వారికి ఒక స్ఫూర్తి గా ధర్మ పరిరక్షణ విషయంలో కొన్ని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ జాగరణ సమితి అధ్యక్షులు నారాయణ రావు, కసుకూర్తి, రాము సహా పెద్దసంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వెంకట్ ఊటుకూరికి హిందూ జాగరణ సమితి ధన్యవాదాలు తెలిపింది.