కేరళ మరో సిరియాలా తయారవుతోందా..అక్కడ వెలుగుచూస్తున్న ఘటనలు చూస్తే అలాంటి అనుమానాలే వస్తాయి. పాఠశాలల విద్యార్థులను జిహాదీల వైపు ప్రోత్సహిస్తున్నారు కొందరు. ఓ SDPI కార్యకర్త నేను బాబరీని అని ఉన్న బ్యాడ్జీలను పిల్లలకు పంచుతున్న ఫొటోలు, వీడియోలు కలకలం రేపుతున్నాయి. చుంగప్పర సెయింట్ జార్జ్ స్కూల్లోని పిల్లలందరికీ వాటిని పంచారు.
ఈ ఫొటోలతో బీజేపీ స్టేట్ చీఫ్ కె. సురేంద్రన్ ట్వీట్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. కొట్టంగల్ పంచాయతీ పరిధిలోని సెయింట్ జార్జ్ స్కూల్ విద్యార్థులకు బలవంతంగా ‘ఐయామ్ బాబరీ’ అని ఉన్న బ్యాడ్జీలు, స్టిక్కర్లు ధరింపచేస్తున్నారు. కేరళ మరో సిరియాలా తయారు కాదా…అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
అసలు నేను బాబరీనని పిల్లలకు చెప్తూ బ్యాడ్జీల్ని పంచడం వెనక ఉద్దేశమేంటని ప్రశ్నించారు సురేంద్రన్…చుంగప్పర పాఠశాల సురేంద్రన్ పోటీ చేస్తూ వస్తున్న పతనంతిట్ట నియోజకవర్గం, జిల్లాపరిధిలోనిది.
కింద ఉన్న ఫొటోల్లో మీరు స్పష్టంగా చూడవచ్చు. స్కూల్ పిల్లలందరి చొక్కాలకు, టేబుళ్లమీద అవి ఉన్నాయి. ఇక వారికి బ్యాడ్జీలు ఇస్తున్న SDPI కార్యకర్త కూడా దాన్ని ధరించాడు. ఈ ఘటనపై పేరెంట్, టీచర్ అసోసియేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోమవారం ఉదయం పాఠశాలలకు పిల్లలు చేరుకుంటున్న సమయంలో ఆ కార్యకర్త వారికి స్టిక్కర్లు, బ్యాడ్దీలు అందించినట్టు తెలిసింది. అయితే తరగతి గదిలో కొందరు ఉపాధ్యాయులు వాటిని తీసివేయించారని విద్యార్థులు చెబుతున్నారు. నిన్న డిసెంబర్ 6, బాబ్రీ కట్టడాన్ని కూల్చివేసిన దినం. అది ముగిసిన చరిత్ర. అక్కడ అంతకుముందు రామ మందిర్ ఉండేదని కోట్లాది భారతీయుల నమ్మకం. అన్ని ఆధారాలతో నిరూపితం అయ్యాక కోర్టు కూడా అక్కడ మందిర నిర్మాణానికి అనుమతిస్తూ ఆదేశాలు సైతం జారీచేసింది. ఆ మేరకు మందిర నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఎస్డీపీఐ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. బాబ్రీ మసీదు ఉద్యమం తిరిగి పుంజుకుంటుందని తాజాగా SDPI ట్వీట్ చేసింది. ముస్లింలు బాబరీ మసీదును మరిచిపోరని… మసీదు పునర్నిర్మాణం జరిగేవరకూ పోరాడాలని ట్వీట్ సారాంశం. SDPI ఇస్లామిక్ సంస్థ… పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) రాజకీయ విభాగం. దీన్ని తీవ్రవాద సంస్థగా గుర్తించి పలు రాష్ట్రాలు నిషేధం విధించాయి. ఈ ఏడాది నవంబర్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఎ .సంజిత్ను భార్య కళ్లముందే నరికి చంపింది SDPI గూండాలే .