జూన్ 9 న చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఈమేరకు బత్తిన సోదరులు సచివాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో భేటీ అయ్యారు. చేప ప్రసాదం పంపిణీకి సహకరిస్తామని, అన్ని ఏర్పాట్లు చేస్తామని మంత్రి వారికి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్ లో బత్తిన సోదరులు పంపిణీ చేసే చేపమందు కోసం ఇతర రాష్ట్రాలనుంచే కాక ఇతర దేశాలనుంచి పెద్దఎత్తున జనం తరలివస్తుంటారు. మందుకోసం అవసరమైన చేపపిల్లలను మత్స్యశాఖ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంచామని మంత్రి తెలిపారు. ఇందుకోసం ఈనెల 25న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్టు శ్రీనివాసయాదవ్ తెలిపారు.