ధర్మ పరిరక్షణ, జాతీయ వాదాన్ని గట్టిగా వినిపించాలనే ఉద్దేశంతో సోనాల గ్రామంలో సభ్యులు “జై హింద్” వాట్సప్ గ్రూప్ ని ఏర్పాటు చేశారు. ఈ గ్రూపులో సోనాలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన జాతీయ వాదులు కూడా ఉన్నారు. గ్రూపు తరపున సభ్యులు ఇంటింటికీ భగవద్గీత అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొదటి దశలో ఆరువందల పుస్తకాలను హైదరాబాద్ గీతాప్రెస్ నుంచి తెప్పించారు. విడతల వారీగా పంపిణి చేస్తామని తెలిపారు. ఇవాళ స్థానిక రామాలయంలో ఆధ్యాత్మిక గ్రంథాలయానికి మొదటి పుస్తకంను అందించి ఇంటింటికీ భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేశారు.