NCERT 12వ తరగతి చరిత్ర పుస్తకం లో’ ‘థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ’ పార్ట్ -2 లోని 234 వ పేజీలో షాజహాన్ మరియు ఔరంగజేబ్ యుద్ధాల సమయంలో కూల్చివేయబడిన దేవాలయాల మరమ్మత్తులు చేయడానికి నిధులు మంజూరు చేశారు అని రాసి ఉంది.
పి.సి. భాండరీ అనే అతను ఈ విషయం మీరు పుస్తకంలో ఏ ఆధారంతో రాసారు అని ఆర్టీఐ (RTI) కింద సమాచారం కోరితే NCERT వారు తాము ముద్రించిన ఈ విషయాన్ని రుజువు చేయడానికి తమ వద్ద ఎటువంటి ఆధారాలు లేవని సమాధానమిచ్చారు. దాంతో భండారి ఆ చరిత్ర పుస్తకం లో ఉన్న ఇటువంటి చాలా అబద్ధాలను తొలగించాలని ఆ పుస్తకంలో మళ్ళీ ఇటువంటివి ప్రచురించకుండా ఆదేశాలు ఇవ్వమని ఈ సం. జనవరి 19 న జైపూర్ కోర్టును ఆశ్రయించారు.
కానీ నోటీసు ఇచ్చిన రెండు నెలల తరువాత కూడా మొఘలులను కీర్తిస్తూ రాసిన ఆ అవాస్తవాలను పుస్తకం నుండి తొలగించలేదని పిటిషనర్ జైపూర్ కోర్టుకు మళ్ళీ తెలిపారు.
దాంతో కోర్టు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ని మరియు NCERT డైరెక్టర్ ని సొంతంగా లేదా వారి న్యాయవాది ద్వారా గాని ఏప్రిల్ 19 లోగా హాజరు కావాలని సంబంధిత పత్రాలతో పాటు వారి జవాబును కూడా సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
ఇదీ ఈ దేశానికి వామపక్ష చరిత్రకారులు చేసిన మహా సేవ. సెక్యూలరిజం చదువుల పేరిట వారు చెప్పిన చెత్తే పిల్లల పాఠ్య పుస్తకాలలో రాశారు. చరిత్ర అన్నది పిల్లలకు ఉన్నది ఉన్నట్లు తెలియచేయాలి. ఏది మంచి ఏది చెడు అన్నది వారి విచక్షణతో పెద్దయ్యాక తెలుసుకుంటారు.
అంతే కానీ తమ వామపక్ష భావజాలాన్ని అబద్ధాల చరిత్రను విద్యార్థులకు అందించే అధికారం వీరికెక్కడిది?
ఇందిరా సమయంలో ఇలా పాఠ్య పుస్తకాలలో వక్రీకరించిన చరిత్ర రాయాలి అనే విషయాల మీద విభేదించిన కర్ణాటక ప్రముఖ చరిత్ర కారులు భైరప్ప గారిని పాఠ్యపుస్తకాలు తయారీ కమిటీ నుండి బయటకు పంపేసి వారికి నచ్చిన ఇటువంటి వక్రీకరించిన చరిత్ర పిల్లల పాఠ్య పుస్తకాలలో చొప్పించారు. గత 70 సం.లుగా విద్యార్థులు నేర్చుకుంటున్నది ఇలా వక్రీకరించబడిన చరిత్రే.
చాడా శాస్త్రి..