లోక్ సభలో సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు నలుగురు కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, రమ్య హరిదాస్, జ్యోతిమణి, టీఎన్ ప్రతాపన్ లను స్పీకర్ ఓం బిర్లా లోక్సభ మొత్తం సెషన్ల నుంచి సస్పెండ్ చేశారు. అంతకుముందు.. కాంగ్రెస్, టిఎంసి, డీఎంకే సహా నిరసన తెలిపిన సభ్యులు నినాదాలు చేయడం, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఉంటే.. ఇప్పుడు కాకుండా మధ్యాహ్నం 3 గంటల తర్వాత సభ వెలుపల చేయవల్సిందిగా హెచ్చరించారు. కానీ అది పట్టించుకోకుండా ప్రతిపక్ష సభ్యులు నిరసన కొనసాగించడంతో.. స్పీకర్ ఘాటుగా స్పందించారు, వారు లేవనెత్తిన సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ప్రజలు సభను నడపాలని కోరుకుంటున్నారని చెప్పారు.