గుజరాత్ అల్లర్ల కేసులో నరేంద్రమోదీతో పాటు మరికొందరికి సిట్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ జకీయా జాఫ్రీ వేసిన పిటిషన్ను సుప్రీం తిరస్కరించింది. న్యాయమూర్తులు ఏఎం ఖాన్విల్కర్, దినేష్ మహేశ్వరి, సీటీ రవికుమార్ తో కూడిన ఈ సందర్భంగా కీలకవ్యాఖ్యలు చేసింది.
కేవలం దురుద్దేశంతో 16 ఏళ్లుగా ఈ కుండను అలాగే ఉడికించడానికి (అంటే ఈ కేసును అలా సజీవంగా ఉంచడానికి) కొందరు తీవ్రప్రయత్నాలే చేస్తున్నట్టు తాము గమనించామని సుప్రీంకోర్టు అంది.
"While parting, we express our appreciation for the indefatigable work done by the team of SIT officials in the challenging circumstances they had to face and yet, we find that they have come out with flying colours unscathed".#SupremeCourt in #Gujaratriots #ZakiaJafri Judgement
— Live Law (@LiveLawIndia) June 24, 2022
న్యాయ ప్రక్రియ దుర్వినియోగానికి పాల్పడిన వారందరి మీద విచారణ సాగాలి ,చట్టానికి అనుగుణంగా వారిపై ముందుకు సాగాలి అని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
గుజరాత్ లోని కొందరు అసంతృప్త అధికారులతో పాటు ఇతరులు కూడా కలిసి వారు చెపుతున్నవి అబద్ధం అని తెలిసి కూడా దానికి విరుద్ధంగా బయటకు చెప్పడం ద్వారా సంచలనం సృష్టించడానికి ప్రయత్నించడం మాకు కనిపించిందనీ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
సిట్ పూర్తి విచారణ. వారి అబద్ధపు వాదనలను బహిర్గతం చేసిందని న్యాయమూర్తులు అన్నారు.
"As a matter of fact, all those involved in such abuse of process, need to be in the dock and proceeded with in accordance with law": #SupremeCourt #ZakiaJafri #Gujaratriots
— Live Law (@LiveLawIndia) June 24, 2022
కోర్ట్ నియమించిన సిట్ విచారణ ను సవాల్ చేయడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని ధర్మాసనం అంది. సిట్ పడ్డ కష్టాన్ని తప్పుగా తక్కువ చేసి చూపించడంగా తాము భావిస్తున్నామనీ అంది.
అసలు సుప్రీంకోర్టు యొక్క వివేకాన్ని ప్రశ్నించే చర్య ఇదనీ ఘాటుగా వ్యాఖ్యానించింది సుప్రీం.
“ఆ కాలంలో మైనారిటీ కమ్యూనిటీకి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా సామూహిక హింసకు పాల్పడమని ప్రేరేపించినట్లు అత్యున్నత స్థాయిలో నేరపూరిత కుట్ర చేశారు అని చూపించడానికి గుర్తించదగిన లింక్ గురించి ఎటువంటి ఆధారం లేదు” అని కోర్టు పేర్కొంది.”