ఉత్తరప్రదేశ్ లోని మైన్ పురి లోక్ సభ ఉపఎన్నిక కోసం సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా డింపుల్ యాదవ్ నామినేషన్ వేశారు. ఆమె నామినేషన్ కార్యక్రమానికి పార్టీ చీఫ్, ఆమె భర్త అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు. అక్టోబర్ 10న అక్కడినుంచి లోక్ సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ములాయం సింగ్ యాదవ్ కన్నుమూయడంతో అక్కడ ఎన్నిక అనివార్యమైంది.డింపుల్ 2019 ఎన్నికల్లో కనౌజ్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
ఇక అక్కడినుంచి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు బీజేపీ. కాంగ్రెస్ ఎస్పీకి మద్దతిస్తుందా లేదా అనేది ఇంతా తేలలేదు. బీఎస్పీ, శివపాల్ యాదవ్ పార్టీ పీఎస్పీఎల్ లు పోటీ చేస్తాయా లేదా అనేదీ తేలలేదు.
ఇక్కడ డిసెంబర్ 5న పోలింగ్ జరుగనుండగా, డిసెంబర్ 8న ఫలితం వెలువడనుంది.
https://twitter.com/ANINewsUP/status/1592084634590154752?s=20&t=5NvaAqIntpeDjAJlVsQeQg