తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న వివాదాలకు తెరదించేందుకు హైకమాండ్ రంగంలోకి దిగింది. రేవంత్ రెడ్డి, సీనియర్ నేతల మధ్య సమన్వయాన్ని కుదిర్చే బాధ్యతను సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కు అప్పగించారు పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. రెండు మూడురోజుల్లో ఆయన తెలంగాణ వస్తారని…సీనియర్ల మధ్య సమన్వయమే లక్ష్యంగా చర్చలు జరుపుతారని తెలిసింది. దిగ్విజయ్ గతంలో పార్టీ ఇన్ చార్జిగా పనిచేశారు. ఇక్కడి సీనియర్లతో ఆయనకు మంచి సంబంధాలున్నందునే ఆయన్ని రంగంలోకి దింపింది పార్టీ. ఇప్పటికే డిగ్గీ…సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్కతో మాట్లాడారు. అలాగే ఏఐసీసీ ప్రధాకార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడినట్టు తెలిసింది. సమన్వయం పాటించాలని హైకమాండ్ నేతలందరికీ సూచించింది.