వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. కాషాయ పార్టీ తనను అంతమొందించాలని కుట్రలు పన్నుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని బంకురాలో జరిగిన ప్రచారంలో భాగంగా దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు.. బీజేపీ పార్టీ మొత్తాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఈసీ సమక్షంలో తన సెక్యూరిటీ డైరక్టర్ను మార్చారని.. తనను హత్య చేసేందుకు ఏమైనా కుట్ర పన్నారా..? అందుకే తన సెక్యూరిటీ డైరక్టర్ను మార్చి వేశారా..?అంటూ ప్రశ్నించారు.
మరోవైపు ఎన్నికల కమిషన్ పనితీరులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవడం ఏంటని.. ఈసీ ఆయన కనుసన్నలోనే నడుస్తున్నట్లు అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా సాగాలని టీఎంసీ ప్రభుత్వం కోరుకుంటున్నామని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. నందిగ్రామ్లో ఎన్నికల నామినేషన్ వేసిన అనంతరం మమతా బెనర్జీ గాయపడిన విషయం తెలిసిందే. అయితే వీల్ఛైర్లో ఉంటూనే బంకురాలో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరోసారి దీదీ దుర్గా మంత్రాన్ని పఠించారు