వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఆర్పీఎఫ్ జవాన్లపై దీదీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మండిపడుతోంది. అంతేకాదు.. ఎన్నికల కమిషన్కు కూడా ఫిర్యాదు చేసింది. ఘోరవ్ సీఆర్పీఎఫ్ జవాన్స్ అంటూ మమతా బెనర్జీ పిలుపునిచ్చారని.. ఇది దేశ వ్యతిరేకమైన చర్య అంటూ ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆమెపై నిషేధం విధించాలని బీజేపీ ఈసీని కోరింది.
కాగా, బుధవారం ఓ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన మమతా బెనర్జీ.. బీజేపీ సీఆర్పీఎఫ్ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు. ఆ జవాన్లు మహిళలను కోడుతూ.. ప్రజలను వేధిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. వీరంతా బీజేపీ సీఆర్పీఎఫ్ అని.. వీరిని గౌరవించనంటూ వ్యాఖ్యానించారు.