టీఎంసీ అధినేత్రి, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఓటమి భయం పట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. ఎన్నడూ లేని విధంగా ఆమె ఓటర్లను విపరీతంగా ప్రాదేయపడుతున్నారు. ఓ వైపు బీజేపీపై విమర్శలు గుప్పిస్తూనే.. ఓటర్లను ప్రభావితం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తర 24 పరగణాస్లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఆమె.. ప్రజల్లో బీజేపీ పట్ల ద్వేషం కలిగేలా కామెంట్స్ చేస్తూ.. మైనార్టీలంతా తన పార్టీకే ఓటు వేయాలంటూ వేడుకుంటున్నారు.
బెంగాల్లో మరో ‘బాంగ్ భంగ్ మూమెంట్’(బెంగాల్ విభజన ఉద్యమం) తీసుకువచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇక్కడి భాషపై, సంస్కృతిపై దాడి చేసేందుకు బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తోందంటూ ఆరోపించారు. ఈ క్రమంలోనే మైనార్టీలను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మైనార్టీల ఓట్లు విడదీసేందుకు రెండు పార్టీలు కుట్రలు చేస్తున్నాయని.. అందుకే మైనార్టీ సోదరసోదరీమణులంతా విభజన రాజకీయ వాదులకు ఓటు వేయోద్దంటూ విజ్ఞప్తి చేశారు.
#CORRECTION | BJP wants to divide Bengal. Do you know about 'Bang* bhang' movement? The same is happening these days. These people want to end Bengal, its language, and its culture: West Bengal CM & TMC chief Mamata Banerjee pic.twitter.com/WDaaEMmOew
— ANI (@ANI) April 3, 2021
I request to all the minority brothers and sisters not to allow their vote division: West Bengal CM & TMC chief Mamata Banerjee in North 24 Parganas pic.twitter.com/58O7KqAbu7
— ANI (@ANI) April 3, 2021