ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి.ఎన్నిక జరిగిన చంపావత్ స్థానంనుంచి 55 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీ సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు.‘‘ చంపావత్ ఓటర్లు కురిపించిన ప్రేమ, ఆశీర్వాదాలతో నా హృదయం ఉప్పొంగుతోంది. ఎంతో ఉద్వేగానికి గురైంది. నాకు మాటలు రావడం లేదు’’ అని ముఖ్యమంత్రి ధామి ట్వీట్ చేశారు.
https://twitter.com/pushkardhami/status/1532583070154358784?s=20&t=ZcjvAPkwu-ce_6ZkDOAtFA
రెండు నెలలక్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాలు సాధించినా ధామి ఓడిపోయారు. అయితే సీఎం అభ్యర్థిగా ఆయన్ని ముందు పెట్టే పార్టీ ఎన్నికలకు వెళ్లింది. ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఆయనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే ఆరునెలల లోగా ఆయన చట్టసభకు ఎన్నికకావల్సి ఉండగా చంపావత్ నుంచి పోటీ చేసి గెలిచారు.