విమానంలో మూత్రవిసర్జన ఘటనలో ఎయిరిండియాపై డీజీసీఏ కఠిన చర్యలకు దిగింది.నిబంధనల అతిక్రమణకు పాల్పడినందుకుగానూ ఎయిరిండియాకు 30 లక్షల రూపాయల జరిమానా విధించింది..ఎయిురిండియా డైరెక్టర్-ఇన్-ఫ్లైట్ సర్వీసెస్కు రూ.3 లక్షల జరిమానా విధిస్తున్నట్టు వెల్లడించింది. విధుల్లో ఉన్న సమయంలో జరిగిన ఘటనను అధికారికంగా తెలియజేయని కారణంగా ఆ విమాన పైలెట్-ఇన్-కమాండ్ లైసెన్స్ను 3 నెలలపాటు రద్దు చేస్తున్నట్టు డీజీసీఏ ప్రకటించింది. న్యూయార్క్ నుంచి ఢిల్లీ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానంలో డెబ్బై ఏళ్ల మహిళా ప్రయాణికురాలిపై శంకర్ మిశ్రా అనే వ్యక్తి మద్యం మత్తులో మూత్రవిసర్జన చేసిన విషయం తెలిసిందే. బాధితురాలు విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు.దీంతో ఆమె ఎయిర్ ఇండియా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్కు లేఖ రాసింది.