యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ఉన్న అన్ని మతాలకు చెందిన ప్రార్థనాలయాలను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు వెంటనే అన్ని జిల్లాల మెజిస్ట్రేట్లు, పోలీసు అధికారులకు దీనికి సంబంధించిన ఆదేశాలను కూడా జారీ చేశారు. రహదారులను ఆక్రమిస్తూ.. అక్రమంగా నిర్మించిన మందిరాలను, ప్రార్ధనాలయాలను గుర్తించాలన్నారు. అలాంటి వాటిపై కఠిన వైఖరి తీసుకోవాలంటూ అధికారులకు సీఎం యోగీ ఆదేశించారు. రహదారులపై అక్రమంగా ఆక్రమించిన స్థలాలను కూడా గుర్తించాలని.. వాటిని తొలగించేందకు డోజర్లను ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రహదారులపై ఉన్న అన్ని మతాలకు చెందిన ప్రార్ధనా మందిరాల జాబితాను మార్చి 14వ తేదీలోగా సమర్పించాంలంటూ యూపీ అదనపు ప్రధాన కార్యదర్శి అవినీష్ అవస్థీ జిల్లా మెజిస్ట్రేట్లకు రాసిన లేఖలో ఆదేశించినట్లు తెలుస్తోంది.