నాలుగు రోజులుగా మోదీ ప్రభుత్వం మీద తెలంగాణ మీడియా వర్గాల్లో నెగిటివ్ ప్రచారం మోత ఎక్కుతోంది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు ఏమాత్రం కేటాయించలేదు అని విస్తారంగా ప్రచారం చేసేసారు. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చేసిన బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ అనే పదం ఎక్కడా పలకలేదు. ఆంధ్రప్రదేశ్ పేరు ప్రస్తావించి మరి రాజధాని అమరావతికి నిధులు కేటాయించడం గమనించాల్సిన విషయం. దీంతో తెలంగాణ గొంతు కోసేశారు.. తెలంగాణ కు అన్యాయం చేసేసారు అని విస్తారమైన ప్రచారం జరిగిపోయింది.
కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదు. వాస్తవానికి బడ్జెట్ ప్రసంగంలో అన్ని రాష్ట్రాల పేర్లు ప్రస్తావించడం కుదరదు. కానీ ఆయా రాష్ట్రాలకు నిధులు ఇవ్వడం జరుగుతూనే ఉంది.
తెలంగాణ విషయమే తీసుకుంటే … కేంద్ర బడ్జెట్ లో
పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రానికి అక్షరాలా 8 లక్షల 62 వేల 488 కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు లెక్క తేలింది. తెలంగాణ ప్రజల అభ్యున్నతి కోసం కట్టుబడి ఉన్నట్లు కేంద్రం లెక్కలతో సహా వెల్లడించింది.
వివిధ పథకాల కింద తెలంగాణకు కేంద్రం ఈ ఏడాది అందిస్తున్న నిధుల వివరాలు చూద్దాం. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద 32, 414/-కోట్ల రూపాయలు, వ్యవసాయ రంగ ఆధునీకరణ మరియు అభివృద్ధి కోసం 1345/-కోట్లు కేటాయించారు. ఇక, పన్నుల్లో వాటా కింద 1,96,420/-కోట్లు తెలంగాణకు దక్కుతాయి.
ప్రధాన పథకాలకు ఇస్తున్న నిధులు కూడా భారీగానే కనిపిస్తున్నాయి. సమగ్ర శిక్ష అభియాన్ కింద 8, 114 కోట్లు ఇస్తున్నారు. మహిళలు,గర్భిణీలు, చిన్నారుల కోసం అంగన్వాడీ కేంద్రాలలో సౌకర్యాల కోసం 9,172 కోట్లు అందిస్తున్నారు.
గిరిజన విశ్వవిద్యాలయం కోసం 980 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. కంపా పథకం అమలు కోసం 4, 018 కోట్లు కేటాయించారు. పెన్షన్ల కోసం 2078 కోట్లు క్రమం తప్పకుండా చెల్లిస్తారు. 14 వ ఆర్థిక సంఘం నిధుల వాటా కింద 8, 769కోట్లు ,, 15వ ఆర్థిక సంఘం నిధుల వాటా కింద 10,882 కోట్లు ఇవ్వబోతున్నారు.
తెలంగాణ గ్రామాల్లో వెలుగులు నింపేందుకు కేంద్రం చొరవ చూపుతోంది. పేద ప్రజల ఇళ్ళ నిర్మాణం కోసం.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 9, 597కోట్లు అందిస్తారు. పట్టణాలు నగరాల్లో మౌలిక వసతుల కోసం.. స్మార్ట్ సిటీ యోజన కింద 500 కోట్లు ప్రకటించారు. అలాగే అమృత్ పథకానికి 3,856 కోట్లు మంజూరు చేశారు.
ఇక,, రామగుండం ఎన్టిపిసి కోసం 10,997 కోట్లు ఖరారు అయ్యాయి. విద్యుత్తు రంగం బలోపేతం కోసం 786 కోట్లు విడుదల చేస్తున్నారు.
ఇవే కాకుండా అనేక చిన్న పథకాలు మరియు కేంద్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ల కింద నిధుల్ని మంజూరు చేస్తున్నారు. ఇవన్నీ స్పష్టంగా బడ్జెట్ పుస్తకాల్లో కనిపిస్తున్నాయి.
అయితే బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ పదం ఎక్కడ పలకకపోవడం తో అపార్ధాలు చోటుచేసుకున్నాయి. ఇదే అతనుగా ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున బురద చల్లుతున్నాయి. సోషల్ మీడియాలో కొన్ని కుహానా శక్తులు కూడా అదే పనిగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. అందుచేత మన తెలంగాణ సమాజంలో వాస్తవాలు తెలియజెప్పడం చాలా అవసరం.