మహ్మద్ ప్రవక్తను అవమానించారంటూ పాకిస్తాన్ ఫైసలాబాద్ లోని చైనా టైల్ తయారీ కర్మాగారంపై స్థానికులు దాడి చేశారు. దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఫైసలాబాద్ లోని టైమ్ సిరామిక్స్ లిమిటెడ్ అనే చైనా టైల్స్ కంపెనీపై స్థానిక పాకిస్తానీలు దాడి చేస్తున్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ తయారైన టైల్స్ పై PBHU అని రాసి ఉంది. అయితే PBHU మహ్మద్ ప్రవక్త పేరు తరువాత ఉంటుందని …అలారాయడం ద్వారా ప్రవక్తను, తమ మత విశ్వాసాలను కంపెనీ గాయపరిచిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంపుగా వచ్చిన స్థానికులు కర్మాగారంలోనికి చొరబడిపోయి టైల్స్ ను విధ్వంసం చేశారు. కంపెనీకి చెందిన చైనా ఇంజినీర్లు, కార్మికుల్నీ తీవ్రంగా కొట్టారు.

File Photo