పాకిస్తాన్ లో హిందూ ఆలయాల ధ్వంసం కొనసాగుతోంది. తాజాగా కరాచీలోని ఓ ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాల్ని పగులకొట్టాడు ఓ దుర్మార్గుడు. ఓల్డ్ కరాచీలోని నారాయణ్ పూరాలో పురాతన నారాయణ మందిరంలో ఈ దారుణం జరిగింది. ముఖేష్ కుమార్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఆలయంలో పూజలు చేస్తుండగా… ఓ వ్యక్తి వచ్చి సుత్తితో విగ్రహాలను పగులకొట్టి ధ్వంసం చేశాడు. అక్కడే ఉన్న మరికొందరు హిందువులు ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతన్ని మహ్మద్ వలీద్ షబ్బీర్ గా గుర్తించారు. అనంతరం పెద్ద సంఖ్యలో హిందువులు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. తమ ఆలయాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.