https://twitter.com/Yashias/status/1370034270496944131
కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఓ వైపు వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతున్నప్పటికీ.. మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అంతేకాదు.. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారికి పాజిటివ్ వచ్చింది. ఛత్తీస్గడ్లోని జాంజ్గిర్-చంపా జిల్లా కలెక్టర్ యశ్వంత్ కుమార్ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారు. అయితే రెండో డోసు తీసుకున్న కొద్ది రోజులకే కరోనా లక్షణాలు కన్పించడంతో ఆయన పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టులో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇటీవల తనని కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అయితే ఫిబ్రవరి 8వ తేదీన కరోనా వ్యాక్సిన్ తొలి డోసు వేయించుకున్నారు. ఆ తర్వాత రెండో డోసు ఈ నెల 8వ తేదీన వేయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించగా.. పాజిటివ్ వచ్చినట్లు తేలింది. అయితే వ్యాక్సిన్పై వచ్చే పుకార్లను నమ్మవద్దని.. రెండో మోతాడు తీసుకున్న అనంతరం.. 14 రోజుల తర్వాత వ్యాక్సిన్ ప్రభావం చూపిస్తుందని తెలిపారు.