ట్విట్టర్ ను పూర్తిగా కొనుగోలు చేస్తానంటూ ట్వీట్లతో ఎలాన్ మస్క్ హల్ చల్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికే వాటాదారుగా ఉన్న ఆయన ట్విట్టర్ ను పూర్తిస్థాయిలో కొంటానంటూ భారీ ఆఫరే ఇచ్చారు.అయితే మొదట్లో పెద్దగా ఆసక్తి చూపని ట్విట్టర్ ఎట్టకేలకు దిగివచ్చింది. డీల్ పై మస్క్ తో చర్చించాలని బోర్డు నిర్ణయించింది.
ట్విట్టర్లో నూరుశాతం వాటాలు కొనుగోలు చేసి మొత్తంగా హస్తగతం చేసుకుంటాననడమే కాదు అందుకు తగిన నగదునుసైతం సిద్ధం చేసుకున్నాడు. ఒక్క షేరుకు 54.20 డాలర్ల చొప్పున చెల్లిస్తానంటూ ఆయన నెల క్రితం ఆఫర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోఅతనితో నేరుగా చర్చలు జరపడమే మార్గమని ట్విట్టర్ బోర్డ్ భావించింది. మొత్తం కంపెనీని మస్క్ కు విక్రయించడం సాధ్యమేనా…అనే అంశాన్ని బోర్డు పరిశీలిస్తోంది. అయితే చర్చలు ప్రారంభించడం అంటే… ఒక్కో షేరుకు మస్క్ ఆఫర్ చేసిన 54.20 డాలర్ల బిడ్ ను కంపెనీ ఆమోదిస్తున్నట్టు కాదని బోర్డ్ పేర్కొంది.
స్వేచ్ఛగా మాట్లాడే వేదికగా ట్విట్టర్ ఉండాలని, ఇందుకోసం అది ప్రైవేటు సంస్థగా మారాలన్న అభిప్రాయాన్ని ఎలాన్ మస్క్ వ్యక్తం చేశాడు. తన బిడ్ కు ట్విట్టర్ అంగీకరించకపోతే… తన దగ్గర ప్లాన్ బీ ఉందనీ ప్రకటించాడు. దీంతో ఈ డీల్ ను వదులుకోవద్దని మెజారిటీ వాటాదారులు కంపెనీని కోరుతున్నారు. ఇక ఈ సందర్భంలో మస్క్ మరో ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఆయన మూవింగ్ ఆన్ ట్వీట్ నెటిజన్లలో గందరగోళం రేకెత్తించగా… మస్క్ అందరి సందేహాలను నివృత్తి చేస్తూ మరో ట్వీట్ తో క్లారిటీ ఇచ్చారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)