దేశ దేశాలకు.. భారత్ వ్యాక్సిన్
కరోనా వైరస్ కు మేడిన్ ఇండియా వ్యాక్సిన్ పలు దేశాలకు ఇప్పటికే చేరింది. మరికొన్ని దేశాలు దీనికోసం ఎదురు చూస్తున్నాయి. మన దేశం నుంచి కొవిషీల్డ్ అందుకున్న మొదటి దేశం భూటాన్. జనవరి 20న లక్షన్నర డోసులు భూటాన్ చేరాయి. అలాగే లక్ష డోసులు మాల్దీవులకు కూడా చేరాయి. మరో పొరుగుదేశం బంగ్లాదేశ్ కు 20 లక్షల డోసుల్ని ఇప్పటికే సరఫరా చేసింది.
నేపాల్ లోని కమ్యూనిస్టు ప్రధాన మంత్రి మనదేశం గురించి ఈమధ్య అవాకులు చవాకులు పేలినా అక్కడి ప్రజల కోసం భారత్ వ్యాక్సిన్ పంపింది. 10 లక్షల డోసులను ఆ దేశ ప్రధాన మంత్రి కెపి శర్మ ఓలి అందుకున్నారు. అలాగే మయన్మార్, సీషెల్స్ కూడా మన వ్యాక్సిన్ డెలివరీ అందుకున్నాయి. దక్షిణ అమెరికా ఖండంలోని బ్రెజిల్ కూడా వ్యాక్సిన్ అందుకుంది. ఆ దేశ అధ్యక్షుడు చాలా సృజనాత్మకంగా ట్విటర్ లో భారతదేశానికి ధన్యవాదాలు తలిపారు.
శ్రీలంక, అప్ఘనిస్తాన్ లకు సరఫరా చేయడానికి అవసరమైన పరిపాలనపరమైన అనుమతులు రావాల్సి ఉంది. సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, మొరాకో తోపాటు మరికొన్ని దేశాలకు కూడా భారత్ వ్యాక్సిన్ ను సరఫరా చేస్తుంది.