ఎన్నికల ఫలితాల అనంతరం పశ్చిమ బెంగాల్లో జరిగిన హింసపై పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. హింసాకాండకు కారకులైన వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విదేశాల్లోనూ భారతీయులు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. 30కి పైగా దేశాల్లోని ప్రవాస భారతీయులు ఆందోళనలు చేశారు.
బెంగాల్లో తృణమూల్ కార్యకర్తలు చేసిన హింసాకాండ వల్ల ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్టకు భంగం కలుగుతోందని
బీజేపీ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఇన్ఛార్జి అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు. మమత బెనర్జీ కనుసన్నల్లోనే అంతా జరిగిందంటూ బయట దేశానికి అపఖ్యాతి తీసుకువస్తోందంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
ఐదు ఖండాల్లోని 30 దేశాల్లోని దాదాపు 50కి పైగా నగరాల్లో భారతీయులు, బెంగాళీలు
పెద్ద ఎత్తున నిర్వహించిన నిరసన కార్యక్రమాలు ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
వివిధ దేశాల్లో జరిగిన నిరసన కార్యక్రమాల ఫొటోలను అమిత్ షేర్ చేశారు. శాసన సభ ఎన్నికల ఫలితాలు మే రెండున వెలువడిన తర్వాత పశ్చిమ బెంగాల్లో చాలా చోట్ల హింస చెలరేగింది. తృణమూల్ పార్టీ కార్యకర్తలు తమ పార్టీ వాళ్లను పొట్టనబెట్టుకుందని బీజేపీ ఆరోపించింది.