అసోంలోని లుమ్డింగ్ రిజర్వ్ ఫారెస్ట్ లోని అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేసింది రాష్ట్రప్రభుత్వం. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలను సత్వరం తొలగించాలన్న గౌహతి హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. అక్రమ కట్టడాల తొలగింపు డ్రైవ్ చేపట్టింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా రాష్ట్ర పోలీసులతో పాటు…సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్..సీఆర్పీఎఫ్ సహా 1000 మంది భద్రతాసిబ్బందిని నియమించారు. అయితే హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం యంత్రాలతో రంగంలోకి దిగేముందే చాలామంది ఆక్రమణదారులు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లారు. ఏనుగులు, పెద్ద పెద్ద యంత్రాలతో నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. రేపు కూడా డ్రైవ్ కొనసాగుతుందని జిల్లా అధికారులు తెలిపారు.
నజ్రుల్ అనే వ్యక్తి….బార్ పేట, నాగావ్, దుబ్రి వంటి ప్రాంతాలనుంచి ముస్లిం కుటుంబాలను తీసుకువచ్చి అక్కడ నివాసం ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఆ అటవీ భూముల్లో అల్లం, పసుపు సాగు చేస్తూ వస్తున్నారు.
రు నివేదికల ప్రకారం, ఆర్థిక కారణాల వల్ల చాలా ఆక్రమణలు జరిగాయి. నజ్రుల్ అనే మాఫియా బార్పేట, నాగావ్, ధుబ్రి వంటి వివిధ ప్రాంతాల నుంచి ముస్లిం కుటుంబాలను తీసుకొచ్చింది. ఈ అటవీ భూముల్లో కోట్ల విలువైన అల్లం, పసుపు సాగు చేసేవారు. నజ్రుల్పై కేసు కూడా నమోదైంది. వలసవచ్చిన ఎంతోమందికి నజ్రుల్ అటవీ భూమిని విక్రయించాడని బిఘాకు లక్షల్లో తీసుకున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.
లుమ్డింగ్ రిజర్వ్ ఫారెస్ట్ నుండి మొత్తం 1500 కుటుంబాలను పంపించివేసినట్టు అసోం సీఎం హిమంత బిశ్వాశర్మ అన్నారు. అక్రమనిర్మాణాల కూల్చివేత ప్రక్రియ శాంతియుతంగా కొనసాగుతోంది. ఇకనుంచి అటవీ భూముల ఆక్రమణలకు తావులేకుండా చూసుకుంటామని అన్నారు.

file photo