ఉత్తరాఖండ్ జోషిమఠ్ లో కుంగుతున్న ఇళ్ల కూల్చివేతలు మొదలుపెట్టారు అధికారులు. ఇళ్లతో పాటు హోటళ్లను కూల్చివేస్తున్నారు. శాస్త్రవేత్తల పర్యవేక్షణలో సురక్షీతం కాని అన్నినిర్మాణాలను కూల్చివేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సంబంధితి అధికారులు పనులు వేగవంతం చేశారు. భూమి దిగబడటంతో జోషిమఠ్ లో 678 ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. దెబ్బతిన్న ఇళ్లకు అధికారులు రెడ్ క్రాస్ మార్కులు వేశారు. బాధిత కుటుంబాలకు నెలకు 4వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థికసాయం అందించారు.ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి బాధిత ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. చమోలిలో భద్రత,రెస్క్యూ ఆపరేషన్ల కోసం అదనంగా 11 కోట్ల రూపాయలను విడుదల చేశారు.