క్వాడ్ సమ్మిట్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు మోదీ. ఇరుదేశాల మధ్య బంధం బలోపేతానికి కట్టుబడిఉన్నట్టు ఈ సందర్భంగా బైడెన్ తెలిపారు. అయితే ఎజెండాలో లేని అంశాలనూ బైడెన్ చర్చకు తెచ్చారు. అసందర్భంగా భారత్,చైనాకు పోలికతెచ్చి భారత్ పై ప్రశంసలు కురిపించారు. కోవిడ్ ను ఎదుర్కోవడంలో బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థగల భారత్ విజయం సాధించిందని…నిరంకుష చైనా,రష్యా వంటిదేశాలు ప్రజాస్వామ్య గొప్పతనాన్ని గ్రహించాలనే అర్థంవచ్చేలా వ్యాఖ్యచేశారు.
ఇండోపసిఫిక్ ప్రాంతంలో పరస్పరసహకారంకోసం ఏర్పడిందే క్వాడ్ కూటమి. భారత్,అమెరికా,ఆస్ట్రేలియా, జపాన్ ఈ కూటమిలోని దేశాలు.