ప్రపంచ వ్యాప్తంగా ఔషధ మొక్కల డిమాండ్ విపరీతంగా పెరుగుతూ ఉండటంతో భారత ప్రభుత్వం వీటి సాగుపై దృష్టి పెట్టింది.
వచ్చే ఏడాదిలో దేశవ్యాప్తంగా 75,000 హెక్టార్లలో అంటే సుమారు 1.80లక్షల ఎకరాల భూమిలో ఔషధ మొక్కల పెంపకం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.
75 సం.ల స్వాతంత్రం సందర్భంగా “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” లో భాగంగా దేశంలో ఔషధ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డ్ (NMPB) జాతీయ ప్రచారాన్ని ప్రారంభించింది. ఇది రైతుల ఆదాయాన్ని పెంచడానికి మరియు గ్రీన్ ఇండియా కలను సాకారం చేయడానికి సహాయపడుతుంది అని చెప్పారు
యూపీలోని సహరన్పూర్, మహారాష్ట్రలోని పూణేలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. పూణెలో రైతులకు ఔషధ మొక్కలను పంపిణీ చేసి ఇప్పటికే ఔషధ మొక్కలను సాగు చేస్తున్న వారిని సన్మానించారు. ఈ సందర్భంగా 75 మంది రైతులకు 7500 ఔషధ మొక్కలను పంపిణీ చేశారు. 75 వేల మొక్కలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
సహరాన్పూర్లో, సమీప జిల్లాల నుండి వచ్చిన 150 మంది రైతులకు ఉచితంగా ఔషధ మొక్కలను పంపిణీ చేశారు. వీటిలో ప్రధానంగా ఐదు జాతుల మొక్కలు ఉన్నాయి – రాత్రి పూట పూసే జాస్మిన్ (పారిజాతం), గోల్డెన్ యాపిల్ (బెల్), మార్గోసా ట్రీ (వేప), ఇండియన్ జిన్సెంగ్ (అశ్వగంధ) మరియు ఇండియన్ బ్లాక్బెర్రీ (జామున్).
గత ఒకటిన్నర సంవత్సరాలలో, ఔషధ మొక్కల మార్కెట్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున పెరిగింది. అమెరికాలో ఇప్పుడు అత్యధికంగా అమ్ముడవుతున్న ఉత్పత్తిలో అశ్వగంధ మూడో స్థానంలో ఉండడానికి ఇదే కారణం అని చెప్పారు.
ఔషధ మొక్కల రంగంలో దేశానికి అపారమైన అవకాశాలున్నాయని, 75000 హెక్టార్లలో ఔషధ మొక్కల పెంపకం ద్వారా దేశంలో రైతులకు పెద్ద ఆదాయ వనరుగా మరే అవకాశం ఉంది అని కేంద్ర మంత్రి అన్నారు
….చాడా శాస్త్రి…