భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పరారైన వ్యాపారవేత్త విజయ్ మాల్యాపై సీబీఐ మరో చార్జి షీట్ దాఖలు చేసింది. ఆయన ఉద్దేశపూర్వకంగానే బ్యాంకులకు రుణం ఎగవేసినట్టు అందులో తాజా చార్జి షీట్లో పేర్కొంది. విదేశాల్లో మాల్యా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను అందులో పేర్కొంది. 2015-16 లో ఇంగ్లండ్, ఫ్రాన్స్ ల్లో మాల్యా 300 వందలకోట్లకు పైగా విలువైన ఆస్తులు కొన్నట్టు ముంబైకోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్లో వివరించింది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కోసం భారతీయ బ్యాంకులనుంచి ఆయన తీసుకున్న మొత్తం కంటే ఎక్కువ ఆస్తులే తన దగ్గర ఉండేవని…ఆ రుణం చెల్లించకుండా బయట అనేక ఆస్తులు కొన్నాడని, తన దగ్గరున్న నగదును స్విట్జర్లాండ్ లోని తన పిల్లల ఖాతాల్లోకి జమచేశాడనీ ఆరోపించింది సీబీఐ. 9వేల కోట్ల రుణ ఎగవేత ఆరోపణలతో 2016లో దేశం విడిచి వెళ్లిన విజయ్ మాల్యా నాటినుంచి యూకేలోనే ఉంటున్నాడు. ఆయన్ని భారత్ కు అప్పగించేందుకు లండన్ అంగీకరించినా…పలు కారణాలు చెబుతూ మాల్యా అక్కడే ఉంటున్నాడు.