గతవారం శ్రీరామనవమి ఊరేగింపుపై దాడులు. మళ్లీ హనుమజ్జయంతి ఊరేగింపుపై దాడి. దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్ పురి ప్రాంతంలో శనివారం జరిగిన హనుమాన్ జయంతి ఊరేగింపుపై దుండగులు దాడిచేశారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. పోలీసులపై కూడా కాల్పులు జరిగాయి.
శోభాయాత్ర జహంగీర్పురిలోని సి బ్లాక్ గుండా వెళుతుండగా ఆ ప్రాంతంలోని కొందరు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. దాంతో మతపరమైన అల్లర్లు చెలరేగాయి. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చి ఉంటున్న రోహింగ్యాలకు జహాంగీర్ పురి కేంద్రంగా ఉంది. వీళ్లే ఢిల్లీ అల్లర్లలో పాల్గొన్నట్టు చెబుతున్నారు.
A mob brandishing swords, pelting stones, chanting Nara e Takbeer confronts a Hanuman Yatra procession – this isn’t from a sleepy town in Jharkhand or from the interiors of MP; this is a scene from the heart of the capital of the Republic of India. HEART. pic.twitter.com/4OaKhSSs15
— Anand Ranganathan (@ARanganathan72) April 16, 2022
ఈ కేసుకు సంబంధించి 21 మందిని అరెస్టు చేశామని, వారిలో 16 మంది ముస్లింలు ఉన్నారని, వారిపై అల్లర్లు, నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ఢిల్లీ పోలీసులు ఆదివారం తెలిపారు. ఇద్దరు యువకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి మూడు తుపాకులు, ఐదు కత్తులు స్వాధీనం చేసుకున్నారు.
केजरीवाल का पालतू गुंडा, जिसने जहांगीरपुरी में हिंदुओं पर हमला किया था। pic.twitter.com/P1Zxprv7pZ
— Prashant Umrao (@ippatel) April 18, 2022
నిందితులందరూ జహంగీర్పురికు చెందిన నివాసితులే. జాహిద్ (22), అన్సార్ (35), షాజాద్ (33), ముక్త్యార్ (28), మహమ్మద్ అలీ (22), అమీర్ (22), అక్షర్ (22), నూర్ ఆలం (28), ఎండీ అస్లాం (22), జాకీర్ (22), అక్రమ్ (22), ఇంతియాజ్ (29), మహమ్మద్ అలీ (27), సలీం సహా అహిర్ (35)గా గుర్తించారు. నిందితులందరినీ ఆదివారం ఢిల్లీ కోర్టు ముందు హాజరుపరిచారు. ప్రధాన నిందితులైన అన్సార్, అస్లాం తోపాటు సలీమ్లకు నేర చరిత్ర ఉందని పోలీసులు అన్నారు. నిందితుల్లో ఒకరైన మహ్మద్ అస్లాం నుంచి పిస్టల్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అల్లర్లలో ప్రధాన నిందితుడైన అన్సార్ ను పోలీసు కస్టడీకి పంపిన ఒక రోజు తర్వాత, అతను ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీతో సంబంధం కలిగి ఉన్నాడని ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా ఈ ఆరోపణలు చేశారు. అన్సార్ ఆప్ సభ్యుడని ఆయన ఆరోపించారు. తన పార్టీలో అల్లర్లకు ఆశ్రయం కల్పించినందుకు పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై గుప్తా మండిపడ్డారు. ఇదిలావుండగా “ఢిల్లీ ఎన్నికల సమయంలో ఆప్ పార్టీ తరపున అన్సార్ చురుగ్గా ప్రచారం చేశాడు” అని నెటిజన్లు ట్వీట్ చేస్తూ, కేజ్రీవాల్ పై మండిపడుతున్నారు.