సునంతా పుష్కర్ కేసులో శశిధరూర్ కు క్లీన్ చిట్ ఇవ్వడంపై డిల్లీ పోలీసులు హైకోర్టుకు వెళ్లారు. శశిధరూర్ పై ఉన్న ఆరోపణల్ని కొట్టివేసి క్లీన్ చిట్ ఇస్తూ పటియాలా కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేశారు పోలీసులు. ఈ కేసు తరువాత దాదాపు 15 నెలలకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. పిటిషన్ ఆలస్యానికి మన్నించాలనీ కోర్టుకు విన్నవించారు. అప్పీల్ ను పరిశీలించిన కోర్టు ధరూర్ కు నోటీసులు సైతం పంపింది. అయితే పిటిషన్ కాపీ తమకు రాలేదని థరూర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో కాపీని నేరుగా థరూర్ కు పంపాలని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చేఏడాది ఫిబ్రవరికి వాయిదా వేశారు న్యాయమూర్తి జస్టిస్ డీకే శర్మ. 2014 జనవరి ఏడున ఢిల్లీలోని ఓ హోటల్లో శశిథరూర్ భార్య సునందా పుష్కర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. తొలుత ఆమెది హత్య అని అనునించారు. తరువాత ఆత్మహత్యగా చార్జిషీట్ దాఖలు చేశారు పోలీసులు. సునంద ఆత్మహత్య చేసుకునేలా థరూర్ ప్రేరేపించారనీ ఆయనపై అభియోగాలు మోపుతూ ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. దీంతో ఆయన డిల్లీ హైకోర్టును ఆశ్రయించగా…పటియాలా కోర్టు 2021 ఆగస్టులో కోర్టును కొట్టివేస్తూ క్లీన్ చిట్ ఇచ్చింది.