తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియోను ప్రచారం చేశారని వెల్లడించారు. ఈ కేసులో సీఎంరేవంత్ తో పాటు పలువురికి సమన్లు ఇచ్చారు.
మే 1న విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు.
రిజర్వేషన్ల అంశంలో అమిత్ షా మాట్లాడుతున్నారంటూ ఒక వీడియో వైరల్ అయింది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అమిత్ షా ప్రకటన చేసినట్లు చూపించారు. కానీ అటువంటిదేమీ లేదని ఇదంతా ఫేక్ వీడియో అని బిజెపి ఇప్పటికే స్పష్టం చేసింది. కాగా,
ఫేక్ వీడియోను షేర్ చేశారంటూ పలువురు కాంగ్రెస్ నేతలకు సమన్లు ఇచ్చారు.
ఈ విషయంలో ప్రధాని మోదీ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇండియా కూటమి నేతలు ఫేక్ వీడియోలు వ్యాప్తి చేస్తున్నారని ఫైరయ్యారు. ఈ క్రమంలోని రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నుంచి సమన్లు వచ్చాయి ఢిల్లీలో పోలీసు యంత్రాంగం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది అన్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఫేక్ వీడియో ఉదంతం మరిన్ని మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది.