ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రకటన తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందన్న ఆ రాష్ట్ర బీజేపీ నేత వ్యాఖ్యలతో ఇక్కడ బీజేపీ ఆమెనుటార్గెట్ చేసింది. ఆమె ఇంటిముందు బీజేపీ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. బీజేపీ శ్రేణులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మరోవైపు పార్టీ చీఫ్ బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా జనగామ జిల్లా పామ్నూరు దగ్గర ఆయన చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆసమయంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తం నెలకొంది. కార్యకర్తలు, పోలీసులను అడ్డుకోబోయారు. దీంతో తోపులాట జరిగింది. కార్యకర్తలు పోలీసులు తీవ్రంగా ప్రతిఘటిస్తూ వారి వాహనాన్ని అడ్డుకున్నారు. పోలీసులు వారిని బలవంతంగా పక్కకు తొలగిస్తూనే ముందుకు సాగారు. దీంతో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. అయితే టీఆర్ఎస్ శ్రేణులు ఆయనపై దాడిచేయవచ్చనే నిఘావర్గాల నివేదిక నేపథ్యంలో ఆయనకు కట్టుదిట్టమైన భద్రత పెంచేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. కానీ అందుకు సంజయ్ తిరస్కరించారు.
https://twitter.com/ANI/status/1561946333111410689?s=20&t=WooBqaWFTrlbWTASjnm3Kw